బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా( Actress Chrisann Pereira ) డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.తాజాగా ఈమె జైలు నుంచి విడుదల అయింది.
ఇటీవలే మాదకదవ్యాల కేసులో( Drugs Case ) భాగంగా రెండు వారాలపాటు జైలు శిక్షను అనుభవించింది.అయితే కావాలనే ఆమెను ఈ కేసులో ఇరికించారు అని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విచారణ అనంతరం ఆమెను నిర్దోషిగా తేల్చి జైలు నుంచి విడుదల చేశారు.
అసలేం జరిగిందంటే.నటి క్రిసాన్ పెరీరా ని డ్రాప్ చేసిన నిందితులు ఆంథోనీ పాల్, అతని స్నేహితుడు రాజేష్ దామోదర్ లు ఒక వెబ్ సిరీస్ ఆడిషన్ కోసం కాఫీ షాప్ లో ఆమెను కలిసి సినిమా స్టైల్ లో కథను వివరించారు.
![Telugu Actresschrisann, Anthony Paul, Bollywood, Chrisannpereira, Drugs, Rajesh Telugu Actresschrisann, Anthony Paul, Bollywood, Chrisannpereira, Drugs, Rajesh](https://telugustop.com/wp-content/uploads/2023/04/actress-chrisann-pereira-released-uae-jail-detailsa.jpg)
ఆ తర్వాత మళ్లీ తిరిగి వెళ్లే సమయంలో ఆమెకు ఒక ట్రోఫీని కూడా అందజేశారు.వాళ్లు ఇచ్చిన ఆ ట్రోఫీని యూఏఈ లో( UAE ) ఒకరికి ఇవ్వాలని అదంతా కూడా స్క్రిప్ట్ లో భాగమే అని ఆమెను నమ్మించారు.వారి మాటల్లో ఆమె గుడ్డిగా నమ్మింది.ఆ తర్వాత ఎయిర్పోర్టులో క్రిసాన్ పెరీరా వద్ద ఉన్న ట్రోఫీని స్వాధీనం చేసుకున్న పోలీసులు చెక్ చేయగా అందులో గంజాయి, మాధక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆమెను అరెస్టు చేశారు.
అయితే తమ కూతుర్ని కావాలనే ఈ కేసులో ఇరికించారు అని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
![Telugu Actresschrisann, Anthony Paul, Bollywood, Chrisannpereira, Drugs, Rajesh Telugu Actresschrisann, Anthony Paul, Bollywood, Chrisannpereira, Drugs, Rajesh](https://telugustop.com/wp-content/uploads/2023/04/actress-chrisann-pereira-released-uae-jail-detailss.jpg)
కాగా గతంలో ఒక పెంపుడు కుక్క విషయంలో క్రిసాన్ పెరీరా తల్లికి అలాగే ఆంథోనీ పాల్ కు గొడవ జరిగిందట.దాంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు.ఈ నేపథ్యంలోనే క్రిసాన్ తల్లిని ఏం చేయలేక క్రిసాన్ పెరీరా ను ఈ మాదక ద్రవ్యాల కేసులో ఇరికించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
జైలు నుంచి విడుదలైన ఆమె పేరెంట్స్ కి ఫోన్ చేసి జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.