ఈ మండే వేసవిలో కమ్మని మామిడి పండ్లు( Mango ) జనులను ఊరిస్తూ ఉంటాయి.సీజనల్గా వచ్చే మామిడి పండ్లను ప్రజలు చాలా ఇష్టంగా తింటూ వుంటారు.
ఈ క్రమంలో రకరకాల మామిడి పండ్లను సేవిస్తూ వుంటారు.బంగిన పల్లి, చెఱుకు రసాలు, సూరం రేఖ, పరియా, విమాన పసంద్ మొదలగు జాతులకు చెందిన పండ్లను బాగా ఇష్టపడుతుంటారు.

అయితే మీకు మ్యాంగో జ్యూస్( Mango Juice )తో మామిడి ఐస్ క్రీం కూడా తయారు చేస్తారనే సంగతి విదితమే.అయిదు మామిడి పండ్లతో ఓ విచిత్ర వంటకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని మీకు తెలుసా?

కావాలంటే ఇక్కడ వీడియోని చూడండి.నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ ని మీరే అంటారు.పండ్లలో రారాజు అయిన మామిడి పండుతో తయారు చేసిన కొత్త వంటకం పానీపూరీ ఇప్పుడు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ కావడం ఇక్కడ చూడవచ్చు.
అయితే ఈ వంటకం చూసిన ఆహార ప్రియులు భిన్నరీతిలో స్పందిస్తున్నారు.పానీపూరీ అనగానే మనకు ఎంతోఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ గుర్తుకు వస్తుంది.పానీపూరీ అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి ఇపుడు ఆహుతులు పానీ పూరీని వెరైటీగా అందించాలనే తాపత్రయంతో ఓ కొత్త ప్రయోగం చేసారు.

అదేమంటే పానీపూరీ( Panipuri )లో పానీకి బదులు మామిడి రసాన్ని నింపుతున్నారు.ఆశ్చర్యంగా వుందా, మీరు విన్నది నిజమే.ఈ వెరైటీ కాంబేషన్ కు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది.
మామిడి రసంతో తయారు చేసిన పానీపూరీ చూసిన కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరేమో చెత్తగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాకుండా ఆహారం విషయంలో తయారుచేసే వెరైటీ కాంబినేషన్స్, ఒక్కోసారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటూ కొందరు కామెంట్స్ చేయడం ఇక్కడ చూడవచ్చు.
ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ పాపులారీలపైనే చేస్తారా అంటూ మరికొంత మంది మండిపడుతున్నారు.ఈ మ్యాంగో పానీపూరీ వీడియోను బాంబే ఫ్యూడీ టేల్స్ అనే వినియోగదారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు.







