ప్రపంచం ఎంత అభివృద్ధి చెందిన సమాజంలో మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను వీడడం లేదు.క్షుద్ర పూజలు, నర బలులు( Occult Pujas, Nara Sacrifices ), చేతబడులు లాంటివి చేస్తే అదృష్టం తలుపు తడుతుందని మూఢనమ్మకాలతో దారుణాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాదులో ఓ 8 ఏళ్ల బాలుడిని నరబలి ఇచ్చిన సంఘటన బయటపడడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.వివరాల్లోకెళితే.
గురువారం రాత్రి హైదరాబాద్లోని సనత్ నగర్( Sanat Nagar ) లో 8 ఏళ్ల బాలుడు మృతి చెందడంపై అనేక రకాల అనుమానాలు నెలకొన్నాయి.గురువారం అమావాస్య కావడంతో కచ్చితంగా నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఓ హిజ్రా మహిళ బాలుడిని నరబలి ఇచ్చి, మృతదేహాన్ని ఓ కాలువలో పడేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి ఆ బాలుడి పేరు అబ్దుల్ వహీద్( Abdul Waheed ) గుర్తించారు.అయితే ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఇమ్రాన్ అనే హిజ్రా ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఇమ్రాన్ ను అదుపులోకి తీసుకున్నారు.8 ఏళ్ల అబ్దుల్ వహీద్ ను చంపి ప్లాస్టిక్ సంచిలో మూతి కట్టి మురికి కాలువలో పడేసినట్లు సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయినట్లు తెలుస్తుంది.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ఇమ్రాన్ ఈ హత్య చేశాడా.? ఇమ్రాన్ తో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా.? ఈ బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఏముంది అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇక బాలుడి మృతి పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Minister Talasani Srinivas Yadav )స్పందిస్తూ.8 ఏళ్ల అబ్దుల్ వహీద్ హత్యకు గురి కావడం చాలా బాధాకరం అని, ఈ హత్యకు పాల్పడిన దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఏది ఏమైనా 8 ఏళ్ల బాలుడి నరబలి హైదరాబాద్ నగరమే ఉలిక్కిపడేలా చేసింది.







