రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ వనజల పెళ్లిరోజు సందర్బంగా రాజన్న గుడి ఆవరణలో సుమారు వందమందికి పైగా అన్నదానం చేయడం జరిగిందని మహిళ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు తోట లహరి అన్నారు.
ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారు ఇలాంటి పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్ధించడం జరిగిందని తోట లహరి అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో ఎద్దడి రాజు,బాలసాని భూమేష్ గౌడ్,రాచకొండ రాజు తదితరులు పాల్గొన్నారు







