భారతదేశంలో గంగానది అత్యంత ప్రముఖమైనది శ్రీపుష్కర స్నానం పవిత్రమైనది.కాగా ఈనెల 22 నుంచి వారణాసిలో గంగా నది పుష్కరాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
గంగా పుష్కరాలు మే 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఈ నేపథ్యంలోనే ఈనెల 29న గంగా ఘాట్ వద్ద కాశీ తెలుగు సంగమం కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.తెలుగు భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మరోవైపు గంగా పుష్కరాల కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి కాశీకి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.







