రెండో రోజు సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి రెండో రోజు సీబీఐ విచారణకు హాజరు అయ్యారు.నిన్న దాదాపు ఎనిమిది గంటలకు పైగా అధికారులు అవినాశ్ రెడ్డిని విచారించారు.

 Kadapa Mp Avinash Reddy For Cbi Investigation On The Second Day-TeluguStop.com

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.ఢిల్లీ సీబీఐ విభాగానికి చెందిన ఎస్పీ వికాస్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం విచారిస్తోంది.

కాగా ముగ్గురుని వేరువేరుగా అధికారులు విచారించారు.కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు.

మరోవైపు వివేకా హత్య కేసుతో సంబంధం లేదంటున్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో ఇవాళ వారి బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube