రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఫ్లెక్సీల కలకలం చెలరేగింది.రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఇల్లంతకుంట మండలానికి సంబంధించి పలు హామీల గురించి ప్రశ్నిస్తూ మోసం చేసిన దొర… దగా పడ్డ జనం అంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్లెక్సీలను తొలగించారు.







