ఇతరుల నిర్లక్ష్యం వల్ల ఎన్నారైల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.ముఖ్యంగా ఇప్పటికే ఎందరో ప్రవాసులు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.
ఇప్పుడు మరో రోడ్డు యాక్సిడెంట్ ఇంకో ఎన్నారై ప్రాణాలను బలితీసుకుంది.సోమవారం రోజు శ్రీలంకలో ( Sri Lanka )ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ కారు యాక్సిడెంట్లో భారత సంతతికి చెందిన 67 ఏళ్ల ఆస్ట్రేలియా మహిళ ప్రకాష్ షరీతా దేవి( Prakash Sharita Devi ) మరణించారు.ఆమె తన కుమార్తె, మరొక వ్యక్తితో కలిసి ప్రయాణిస్తుండగా, వారి కారు హెమ్మతగామలో రోడ్డుపైకి వెళ్లి కొండపైన బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్, 30 ఏళ్ల మహిళ గాయపడ్డారు.వారిని గంపోలా ఆసుపత్రికి తరలించారు.వీరిద్దరి పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియ రాలేదు.కారు డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.ప్రకాష్ షరీతా దేవి ఆస్ట్రేలియాలోని( Australia ) సిడ్నీకి చెందినవారు.ఆమె ప్రమాదంలో తీవ్ర గాయాల పాలు అయ్యారు.
ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

ఇకపోతే 2019లో, అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో యోస్మైట్ నేషనల్ పార్క్కి( Yosemite National Park ) వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు భారతీయ-అమెరికన్ తోబుట్టువులు మరణించారు.2020లో, ఆస్ట్రేలియాలో భారతీయ సంతతికి చెందిన మహిళ తన కుటుంబంతో ప్రయాణిస్తున్నప్పుడు కారు ప్రమాదంలో మరణించింది.2021లో, కెనడాలో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్ఆర్ఐ కుటుంబం మరణించింది.2018లో, కోస్టారికాలో విహారయాత్రలో ఉండగా జరిగిన విమాన ప్రమాదంలో భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త, అతని కుటుంబం మరణించారు.ఇలాంటి విషాదకరమైన సంఘటనలు బాధిత కుటుంబంలో దుఃఖాన్ని మిగిల్చాయి.







