నిరాహర దీక్షకు అనుమతి నిరాకరించడంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం కేసీఆర్ కు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు.
ఎన్ని కుట్రలు చేసినా నిరుద్యోగ పోరాటం ఆగదని షర్మిల తేల్చి చెప్పారు.అందరి సహకారంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వెల్లడించారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ది ఉద్యమ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలంటూ వ్యాఖ్యానించారు.ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తారా అని ధ్వజమెత్తారు.