ఎన్టీఆర్ జిల్లా మైలవరం మట్టి మాఫియాపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా అటవీ, అసైన్డ్ భూముల్లో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని టీడీపీ నేత దేవినేని ఆరోపిస్తున్నారు.
కొండపల్లి అడవిని, ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చే బూడిద, పోలవరం కాలువ మట్టిని దోచుకుంటున్నారని తెలిపారు.మరోవైపు ఈ మట్టి మాఫియాపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో పోలవరం కట్ట సైతం కొట్టేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.ఎమ్మెల్యే ఫిర్యాదుతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది.
ఈ నేపథ్యంలో తవ్వకాలు జరిగిన ప్రాంతానికి వెళ్లిన అధికారులు సమీక్షిస్తున్నారు.







