తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ సంకల్ప సిద్ధి స్కామ్ కేసులో పురోగతి లభించింది.కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న గుత్తా కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించిన బెజవాడ పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేశారు.స్కామ్ బయటపడగానే కిరణ్ ను అరెస్ట్ చేయగా నగదు రికవరీ చేస్తానంటూ కర్ణాటక తీసుకువెళ్లాడు.
ఈ క్రమంలోనే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు.దీంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలించి పట్టుకున్నారు.







