తెలంగాణలో నిరుద్యోగం పెద్ద సమస్య అని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు గుండు సున్నా అని తెలిపారు.
ఇంటికో ఉద్యోగమని చెప్పి కేసీఆర్ మాట తప్పారని షర్మిల విమర్శించారు.ప్రతిపక్షాలన్నీ ఏకమై నిరుద్యోగంపై పోరాటం చేయాలని వెల్లడించారు.
నిరుద్యోగుల పోరాటం కోసం టీఎస్ఏవీఈను ఫామ్ చేద్దామన్న షర్మిల దీనికి కోదండరాం లేకుంటే మరొకరిని కన్వీనర్ గా పెట్టుకుందామని తెలిపారు.కలిసి పోరాటం చేస్తే ప్రగతిభవన్ లో ధర్నా చేయొచ్చని పేర్కొన్నారు.