సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram ) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”SSMB28”.ప్రస్తుతం ఈ కాంబో కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ కాంబోలో అతడు, ఖలేజా వంటి రెండు డిఫరెంట్ మూవీస్ వచ్చాయి.ఈ రెండు ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.
మరి ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ సినిమాతో ఈ కాంబో రాబోతుంది.
త్రివిక్రమ్ కూడా వీరి అంచనాలకు తగినట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
త్రివిక్రమ్ ఫ్యామిలీ అంశాలతో పాటు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో అదిరిపోయే అప్డేట్ వినిపిస్తుంది.
ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.ఇటీవలే మేకర్స్ అఫిషియల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.మరి సంక్రాంతికి ఎప్పుడు మన టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య భారీ పోటీ ఉంటుంది.
అయితే తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం సూపర్ స్టార్ మాత్రమే సోలోగా రిలీజ్ చేయబోతున్నాడు అని టాక్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ సంక్రాంతికే (Sankranti 2024) అని టాక్ వచ్చిన ఇంకా ఇది మొదలు కానే లేదు.మరి అప్పటికి షూట్ పూర్తి అయితేనే రిలీజ్ కు సాధ్యం.మిగతా హీరోలు కూడా సంక్రాంతికి వచ్చే వారు లేరు.
అందుకే మహేష్ సోలోగా రాబోతున్నాడు.వస్తే శంకర్ ఇండియన్ 2 ద్వారా వచ్చిన తెలుగు హీరోగా మాత్రం ప్రెజెంట్ సూపర్ స్టార్ మాత్రమే కనిపిస్తున్నాడు.
చూడాలి అప్పటికి గణాంకాలు తారుమారు అవుతాయో లేదో.