న్యూస్ రౌండప్ టాప్ 20

1.రేవంత్, సంజయ్ కు షర్మిల ఫోన్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.

నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాటం చేద్దామని ఆమె కోరారు.

2.ఎంపీ సంజయ్ రౌత్ కు గ్యాంగ్ స్టర్ బెదిరింపు

ఏకే 47 తో లేపేస్తానని గ్యాంగ్ స్టార్ లారెన్స్  మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ పై బెదిరింపు కు దిగారు.

3.ఫార్మా కంపెనీల డైరెక్టర్ ఇంట్లో ఈడి సోదాలు

ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాదులో పలుచోట్ల ఈడి ( ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు సోదాలు నిర్వహించారు.ముఖ్యంగా ప్రముఖ ఫార్మా కంపెనీల డైరెక్టర్ గోపి కృష్ణ నివాసంలో ఈడి ఆకస్మిక సోదాలు నిర్వహిస్తోంది.

4.జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.వెల్గటూరు మండలం శాహిగామ వెళ్లేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డి ఇథనాల్ ప్రాజెక్ట్ బాధితులను కలిసేందుకు వెళుతుండగా ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు.

5.భోపాల్ న్యూఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గోపాల్ న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన నరేంద్ర మోది ఈరోజు ప్రారంభించారు.

6.హైదరాబాద్ కు ప్రధాని రాక

ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోది హైదరాబాద్ కు రానున్నారు.తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని ప్రారంభించనున్నారు.

7.ఫేక్ పోస్టులలో వైసీపీ దుష్ప్రచారం : టీడీపీ

సోషల్ మీడియా వేదికగా ఫేక్ పోస్టులతో వైసిపి దుష్ప్రచారంకి పాల్పడుతోందని టిడిపి నేత బొండా ఉమ విమర్శించారు.

8.కాపు సంఘం నేతలతో చంద్రబాబు భేటీ

Advertisement

టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు అమరావతి లో కాపు సంఘం నేతలతో భేటీ అవుతున్నారు.

9.కెసిఆర్ పై లక్ష్మణ్ విమర్శలు

భద్రాచలం వెళ్తే సీఎం పదవి కి ముప్పు వస్తుంది అనే కేసీఆర్ వెళ్లడం లేదని, బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు.

10.కేటీఆర్ సవాల్

కాంగ్రెస్ బిజెపి మంత్రి కేటీఆర్ మరోసారి టార్గెట్ చేశారు.తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,  అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చాలని కేటీఆర్ సవాల్ చేశారు.

11.హజ్ యాత్రకు యాత్రికుల ఎంపిక

దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులను ఎంపిక చేసేందుకు హౌస్ కమిటీ న్యూఢిల్లీలో డ్రాను నిర్వహించింది.తెలంగాణ రిజర్వుడ్ కేటగిరీలకు చెందిన 3690 మంది యాత్రికులు జనరల్ కేటగిరి తో శుక్రవారం లాట్ డ్రా ద్వారా ఎంపిక అయ్యారు.

12.అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా ఫైర్ పరికరాలు ఎగ్జిబిషన్, ప్రజల అవగాహన కోసం అగ్ని ప్రమాదాలపై ఫైర్ సేఫ్టీ డిజి నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు.

13.ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు

గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయ్యింది.రాజాసింగ్ పై అఫ్జల్ గంజ్  పోలీసులు కేసు నమోదు చేశారు.

14.పదో తరగతి పరీక్షలు

3 వ తేదీ సోమవారం నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

15.సోము వీర్రాజు మండిపాటు

బీజేపీ నేత సత్యకుమర్ పై వైసీపీ నేతలు దాడి వ్యవహారం కలకలం రేపుతోంది.ఈ ఘటన పై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

16.జగన్ పై విమర్శలు .మాజీ మంత్రి పై కేసు నమోదు

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

17.  రాహుల్ యాత్ర వాయిదా

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 9 న కర్ణాటక లోని కోలార్ లో జరిగే ర్యాలీలో ప్రసంగించనున్నారు.ఏప్రిల్ 5న కొల్లార్ లో జరగాల్సిన సత్యమేవ జయతే కార్యక్రమాన్ని ఏప్రిల్ 9కి వాయిదా వేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు .

18.భట్టి విక్రమార్క కామెంట్స్

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కాం పై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శలు చేశారు.ఢిల్లీ తరహాలో తెలంగాణలో లిక్కర్ స్కాం జరుగుతోందని,  లోతుగా విచారణ చేపడితే విషయం బయటపడుతుందని విక్రమార్క అన్నారు.

19.తిరుమల సమాచారం

తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు నుంచి దివ్య దర్శనం టోకెన్లను తిరిగి జారీ చేయనుంది.తిరుమల కొండకు నడిచి వెళ్లే భక్తుల కోసం దివ్యదర్శనం టికెట్లు మంజూరు చేయనున్నారు.

20.మోది పై కేటీఆర్ ట్వీట్

ప్రధాని నరేంద్ర మోది డిగ్రీ సర్టిఫికెట్ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.నా సర్టిఫికెట్లను పబ్లిక్ గా చెప్పగలను అంటూ మోది పై ట్వీట్ చేశారు.

తాజా వార్తలు