తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో వివాదం రాజుకుంటోంది.
ఈ మేరకు నేతల మధ్య ట్వీట్ వార్ తీవ్రరూపం దాల్చుతోంది.
మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నడుమ ట్వీట్ యుద్ధం కొనసాగుతోంది.
తెలంగాణలో బీజేపీ ఎందుకంటూ కేటీఆర్ ట్వీట్ చేయగా.అదే తెలంగాణలో కేసీఆర్ ఎందుకంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్వీట్ ఫైట్ లోకి కాంగ్రెస్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు రెండు పార్టీలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది.
దొంగలు దొంగలు తన్నుకుంటే చోరీ కథ బయపడిందంటూ విమర్శలు గుప్పించింది.ఇద్దరూ తోడు దొంగలేనంటూ కౌంటర్ అటాక్ చేసింది కాంగ్రెస్.