రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంక పెళ్లి సర్పంచ్ జింక సునీత భర్త జింక వేణు అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాన్ని బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వారి వెంట అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు చింతపల్లి శ్రీనివాస్ రావు, రాగుడు పరశురాం, కత్తి కనకయ్య, ఎర్రం రాజు, అనుపట్ల ప్రభాకర్ రెడ్డి, ఇటిక్యాల లింగయ్య, చిలివేరి శ్రీనివాస్ గౌడ్, తాడెం శ్రీను, తదితరులు ఉన్నారు.