కాంగ్రెస్ నాయకురాలు, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ పై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ శ్రీరాముడు, పాండవులు కుటుంబ వాదులా అని ప్రశ్నించారు.సాంస్కృతిక లక్ష్యాలే కుటుంబ వాదమా అని అన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం సిగ్గుపడాలా అన్న ప్రియాంక గాంధీ దేశ భూమిలో, దేశ జెండాలు తన కుటుంబ రక్తం ఉందని చెప్పారు.దేశ ప్రజాస్వామ్యం కోసం తన కుటుంబం రక్తం ధార పోసిందని వెల్లడించారు.