బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ అనసూయ ( Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ యాంకర్( Jabardasth ) గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ఇలా ఈమె వెండి తెరపై వరుస సినిమా అవకాశాలతో ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లలో అవకాశాలు రావడంతో అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.
ప్రస్తుతం ఈమె పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి అనసూయ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా బిజీగా గడుపుతున్నారు.సినిమా షూటింగ్లో నుంచి తనకు ఏమాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తూ ఉంటారు.ఇలా తమ హాలిడే వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోని తాజాగా అనసూయ తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా( Social media )లో షేర్ చేశారు.
ఈ ఫోటోలలో అనసూయ ట్రెండీ వేర్ ధరించి చాలా స్టైలిష్ లుక్ లో ఉన్నారు.ఇక తన పిల్లలతో కలిసి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్న ఫోటోలను అలాగే సైక్లింగ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను కూడా అనసూయ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా అనసూయ తన భర్త పిల్లలతో కలిసి చిల్ అవుతున్నటువంటి ఈ ఫోటోలుసోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటోలపై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అనసూయ లేటెస్ట్ ఫోటోలు పై ఓ లుక్ వేసేయండి.