నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా డి గ్లామర్ పాత్రలలో మాస్ యాక్షన్ చిత్రం దసరా (Dasara) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా (Pan India) స్థాయిలో మార్చి 30 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని (Nani) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ట్రైలర్ను విడుదలై దుమ్ములేపుతోంది.కొన్ని గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్ను రాబట్టి కేక పెట్టించింది. ఈ ట్రైలర్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.ఇలా ఈ సినిమా ఇతర భాషలలో కూడా భారీ అంచనాలను ఏర్పరచుకుంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్( sensor)పనులు కూడా పూర్తి అయినట్టు తెలుస్తుంది.చిన్న చిన్న కట్స్తో ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు.

సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ తో పాటు సినిమా రన్ టైం (Run Time) కూడా లాక్ చేశారు.ఈ సినిమా 2 గం.36 ని. ల నిడివి ఉండనుంది.ఇక ఈసినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో కనిపించబోతున్నారు.ఇక ఈ సినిమాకుసంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్.దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట.నాని సినిమాల్లోఈ సినిమా హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా అని తెలుస్తుంది.
ఇక ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.







