ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.అసెంబ్లీ సమావేశాల్లో నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు.
సభకు పదేపదే ఆటంకం కలిగిస్తున్నారని స్పీకర్ తెలిపారు.ఈ క్రమంలో టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, నిమ్మలను స్పీకర్ తమ్మినేని సీతారాంలను సస్పెండ్ చేశారు.
కాగా బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వీరిద్దరిపై సస్పెన్షన్ కొనసాగనుంది.మిగిలిన టీడీపీ సభ్యులను ఒక్కరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.
అనంతరం టీడీపీ సభ్యులను మార్షల్స్ బయటకు పంపించారు.అసెంబ్లీ నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
సమావేశాలు ముగిసే వరకు కోటంరెడ్డిపై ఈ చర్యలు కొనసాగనున్నాయని స్పీకర్ వెల్లడించారు.







