ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్(Flipkart) మరోసారి భారీ ఆఫర్ల వెల్లువతో వినియోగదారుల ముందుకు వచ్చింది.ఈరోజునుండి అనగా మార్చ్ 11 నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను(Big Saving Days) నిర్వహిస్తోంది.
విషయం మీకు తెలిసే ఉంటుంది.లేకపోతే తెలియనివారు దీన్ని గమనించగలరు.
ఇందులో భాగంగా మీకు ఇష్టమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీకు అందుబాటు ధరలలోనే లభించగలవు.ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపులు ఉండడం గమనార్హం.
ఇది సమ్మర్ సీజన్(Summer Season) కనుక ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, స్మార్ట్ టీవీలు కొనాలని ప్లాన్ చేసే వారికి ఇదొక సదవకాశం అని చెప్పుకోవాలి.

అద్భుతమైన డిస్కౌంట్ల ధరలతో మీరు సదరు వస్తువులను ఇక్కడ సొంతం చేసుకోవచ్చు.ఈ సేల్ లో ఏసీలు రూ.21,490 ప్రారంభ ధరతో అందుబాటులో కలవు.అదేవిధంగా మైక్రోవేవ్ ఓవెన్స్ ను 45 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.అలాగే పాపులర్ కంపెనీలు ఐనటువంటి సాంసంగ్, ఎల్జీ, ఓల్టాస్ తదితర కంపెనీలకు చెందిన ఎనర్జీ ఎఫీషియంట్ ఏసీలపై రూ.40 వేల వరకు తగ్గింపు ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించడం విశేషం.ఇంకా టాప్ వాటర్ ప్యూరిఫైయర్ లపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

అంతేకాకుండా ఇపుడు రిఫ్రిజిరేటర్లను (Refrigirators) రూ.13,990 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు.అలాగే బ్రేక్ ఫాస్ట్ అప్లియెన్సెస్.అయినటువంటి కెటిల్స్, కాఫీ మేకర్స్ పై 70 శాతం వరకు తగ్గింపు ఉందంటే మీరు నమ్ముతారా? జ్యూస్ మిక్సర్ గ్రైండర్లను రూ.1,199లకే కొనుగోలు చేయవచ్చు.మైక్రోవేవ్స్ అయితే రూ.1,999 ధరతో మీకు అందుబాటులో వున్నాయి.డిష్ వాషర్లు సైతం రూ.19.490 ప్రారంభ ధరతో కొనేయొచ్చు.ఈ సేల్ లో బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉండడం చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి.ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు.







