హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరుకానున్నారని తెలుస్తోంది.కాగా కేంద్ర విధానాలు, బీజేపీ వైఖరిని ఎండగట్టాలని బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో చేయాల్సిన కార్యాచరణపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.







