కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, రెండు నెలల క్రితం ఇంటర్యూలు జరిగిన మైనారిటీ కార్పొరేషన్ లోన్లు ఇస్తారా లేదా అని గురువారం భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ లో పాలకమండలిని,అధికారులను ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు నిలదీశారు.మైనార్టీ కార్పొరేషన్ నుండి మంజూరైన నాలుగు లోన్లకు నాలుగు వందల అప్లికేషన్ వచ్చాయని, దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారని,అయినాఇప్పటి వరకూ అతీగతీ లేదని వాపోయారు.
అప్లికేషన్ చేసుకున్న లోన్లు ఎప్పుడు వస్తాయని పేద ముస్లింలు ఎదురు చూస్తున్నారని,అసలు వస్తాయా లేదా అని అయోమయంలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.మైనార్టీ కార్పొరేషన్ లోన్ల పేరుతో మైనార్టీలను కేసీఆర్ ప్రభుత్వం మభ్య పెడుతుందని,దీనికి సమాధానం ఎవరు చెబుతారని ప్రశ్నించారు.