వరంగల్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో పురోగతి లభించింది.ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాహుల్, జశ్వంత్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.కాగా ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రక్షిత ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
మృతురాలి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటా సేకరించే పనిలో పడ్డారు.కాగా మృతురాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటకు సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది.