హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీరంగం సృష్టించారు.అర్ధరాత్రి సమయంలో మాస్కులు ధరించిన సుమారు 70 మంది ఓ ఇంటిలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
ఒకేసారి ప్రవేశించిన దుండగులు స్థలం ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం.దీంతో ఇంట్లో ఉన్న వారందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అనంతరం బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.అయితే తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, పోలసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.







