అనంతపురం జిల్లాలోని ఎస్కే వర్సిటీలో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారన్న విషయంపై వివాదం కొనసాగుతోంది.ఈ క్రమంలో దీనిపై వీసీ రామకృష్ణారెడ్డి స్పందించారు.
వర్సిటీలో హోమం నిర్వహించడంలో ఎటువంటి రాజకీయం లేదని తెలిపారు.
వర్సిటీలో ఐదుగురు టీచర్ల మృతి చెందడం వలనే సిబ్బంది బాగుండాలనే మృత్యుంజయ హోమం చేస్తున్నామని తెలిపారు.ఈనెల 24న ఉదయం 8.30 గంటలకు హోమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ డబ్బులతోనే హోమం నిర్వహిస్తున్నమన్న వీసీ ఇందుకు వర్సిటీ నిధులు ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో మృత్యుంజయ హోమానికి ఎవరైనా రావొచ్చని వెల్లడించారు.







