తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రలో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించాడు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఘర్షణకు దిగాడు.
జనగామ జిల్లా దేవరుప్పుల క్యాంపు వద్ద సెక్యూరిటీకి, పార్టీ కార్యకర్తలకు మధ్య వివాదం నెలకొందని తెలుస్తోంది.ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో దేవరుప్పుల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.







