టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందాడు.
ఇక అప్పటినుండి అల్లు అర్జున్ నటించిన సినిమాలు అన్ని దాదాపుగా హిట్ అవటంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.
ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యి ఆయనకు అభిమానులుగా మారిపోయారు.అంతటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమాని తెరకెక్కించే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.కొద్దిరోజులుగా వైజాగ్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగింది.తాజాగా ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో అల్లు అర్జున్ తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైజాగ్ లో బీచ్ ముందు నిలబడి ఉన్న ఫోటోని అల్లు అర్జున్ ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేస్తూ.” థాంక్యూ వైజాగ్.విశాఖపట్నం నాకు ఎప్పటికైనా ప్రత్యేకమే” అంటూ నోట్ రాసుకోచ్చాడు.ఇలా వైజాగ్ మీద తనకి ఉన్న ఇష్టాన్ని అల్లు అర్జున్ తెలియజేశాడు.దీంతో అక్కడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పుష్ప సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రేక్షకుల అంచనాలను అందుకోవటానికి సుకుమార్ చాలా కష్టపడుతున్నాడు.ఇక ఈ పుష్ప 2 సినిమా పుష్ప సినీమా కన్నా అంతకు మించి ఉంటుందని అల్లు అర్జున్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.