బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని అనుకున్నామని తెలిపారు.
అద్భుతమైన బొమ్మలు చూపించారన్న పొంగులేటి ఎక్కడో రెండిళ్లు కట్టించి ఆశచూపి మోసం చేశారని విమర్శించారు.గిరిజనులు, ఆదివాసీల మధ్య గొడవపెట్టారని తెలిపారు.
దొడ్డిదారిన కాంట్రాక్టులు ఇచ్చి ఎన్ని వేల కోట్లు వేనకేశారో అని ప్రశ్నించారు.ప్రశ్నించినందుకు సస్పెండ్ చేస్తే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయండన్న ఆయన తన అనుచరులను మాత్రం ఇబ్బంది పెట్టొద్దని కోరారు.
అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదని వ్యాఖ్యనించారు.అధికారులు ఎవరికి ఎంత ఇచ్చి పోస్టింగులు పొందారో తెలుసని చెప్పారు.
తన అనుచరులను బెదిరిస్తే వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు.అనంతరం తన కార్యకర్తల సూచన మేరకు పార్టీ మార్పు ఉంటుందన్నారు.
ఏ డేట్ లో పార్టీ మారితే బావుంటుందో త్వరలో చెబుతానని స్పష్టం చేశారు.