నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కోస్గిలో మున్సిపల్ అధికారులకు, స్థానికులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.
కోస్గి నుంచి తుంకిమెట్ల వెళ్లే రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వివాదం రాజుకుంది.అయితే అధికారులు నిర్వహిస్తున్న రోడ్డు విస్తరణ పనుల వల్ల ఉపాధి కోల్పోతున్నామని స్థానికులు వాపోతున్నారు.
మరోవైపు రోడ్డుపై ఉన్న దుకాణ సముదాయాలకు నష్ట పరిహారం చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు.ఈ మేరకు నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పటిష్ట బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు.ఈ నేపథ్యంలో పనులు అడ్డుకున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.