సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది.దీంతో సెలబ్రిటీలు సైతం అభిమానులతో వారి విషయాలను షేర్ చేసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.
వ్యక్తిగత విషయాల నుంచి ఫ్యామిలీ విషయాల వరకు ప్రతి ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ అందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా ఒక బుల్లితెర నటి బెంజ్ కారుని కొనుగోలు చేసి అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.
ఇంతకీ ఆ బుల్లితెర నటి మరెవరో కాదు నటి రూపాలి గంగోలి. బాలీవుడ్ సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.మొదట సినిమాలలో నటించినప్పటికీ రాణి గుర్తింపు సీరియల్స్ లో నటించి భారీగా పాపులారిటీనీ సంపాదించుకుంది.సీరియల్స్ లో దాదాపుగా 20 కు పైగా సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది రూపాలి.
అంతేకాకుండా బిగ్ బాస్ షో సీజన్ 1 లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ ని సంపాదించుకుంది.ఒక వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా రూపాలి ఖరీదైన వైట్ కలర్ మెర్సిడేస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది.
ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుని ఒక్కసారిగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది.అయితే తాజాగా రూపాలి షేర్ చేసిన ఆ వీడియోలో షోరూంలో తన భర్త కొడుకు లతో కలిసి కేక్ కట్ చేసింది.అనంతరం కారు దగ్గర నిలబడిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోలను చూసిన అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.ఎందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ జై మాతాడి జై మహాకాల్.
నా కలలు నిజం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అని రాసుకొచ్చింది.ఇకపోతే ప్రస్తుతం రూపాలి కొన్న కారు గురించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.
చాలామంది నెటిజెన్స్ అభిమానులు ఆ కారుదైన తెలిసి షాక్ అవుతున్నారు.రూపాలి కొన్న ఆ కారు ధర దాదాపుగా రూ.90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.చాలామంది ఆ ధర విని షాక్ అవుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.