మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు పాన్ వరల్డ్ గా పేరు తెచ్చుకున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చరణ్ ఆ తర్వాత గ్లోబల్ వైడ్ గా స్టార్ డమ్ ను అందుకుంటున్నాడు.
ఈ సినిమా తర్వాత మరో అగ్ర డైరెక్టర్ ను చరణ్ లైన్లో పెట్టుకున్నాడు.ఇండియన్ కామెరూన్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఆర్సీ15 సినిమా చేస్తున్నాడు.
శంకర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా షూట్ ఇప్పటికే చివరకు చేరుకుంది.80 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.దిల్ రాజు తన కెరీర్ లోనే మొదటి సారి ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టడంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి.
ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఏదొక వార్త వస్తూనే ఉంది.తాజాగా మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో మరో సీనియర్ హీరో నటిస్తున్నాడు అంటూ తాజాగా టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విప్లవ నాయకుడి పాత్ర ఒకటి ఉందట.ఆ పాత్ర చరణ్ పాత్రకు గురువు పాత్ర అని టాక్.
మరి ఈ పాత్ర కోసం కన్నడ హీరో ఉపేంద్రను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.ఈ పాత్ర సినిమాలో సెకండాఫ్ లో వస్తుంది అని స్పెషల్ రోల్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట.మరి మేకర్స్ చెప్పిన ఈ పాత్రలో నటించడానికి ఉపేంద్ర అంగీకరిస్తాడో లేదో వేచి చూడాలి.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ అయితే రాలేదు.