కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సినిమాలలో కాంతార ఒకటి.దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలైంది.
కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా అక్టోబర్ నెలలో వివిధ భాషలలో విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా అన్ని భాషలలో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా ఏకంగా రెండు విభాగాలలో ఆస్కార్ నామినేషన్ లో కూడా ఉన్న విషయం తెలిసిందే.

ఇలా ఈ సినిమా అద్భుతమైన హిట్ అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా ఇదివరకు ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే సీక్వెల్ తప్పనిసరిగా ఉంటుందని చిత్ర నిర్మాతలు హోంబలే ఫిలిం మేకర్స్ కూడా వెల్లడించారు.అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి మరోసారి మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ చిత్రం చేయాలా లేదా అన్న విషయం గురించి చిత్ర బృందం పంజుర్లీ మాత ఆశీస్సులు కూడా తీసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను వర్షాకాలంలో చిత్రీకరించాల్సి ఉండగా ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని జూన్ నెలలో ప్రారంభించబోతున్నట్లు హోంభలే ఫిలిమ్స్ వెల్లడించారు.ఇలా ఈ సినిమా జూన్ నెలలో షూటింగ్ ప్రారంభం చేసుకుని వచ్చే ఏడాది సమ్మర్ సెలవలలో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలియజేశారు.







