ఎప్పటి నుంచో సినీ నటులు, నటీమణుల పిల్లలు పెద్ద తెరపై కాలుమోపుతుండటాన్ని చూస్తున్నాం.ఇది స్టార్కిడ్స్ యుగం.
షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా, అమితాబ్ మనవడు అగస్త్య నందా అతి త్వరలో ది ఆర్చీస్ తో బాలీవుడ్ అరంగేట్రం చేయనుండగా, శశి కపూర్ మనవడు జహాన్ కపూర్ కూడా హన్సల్ మెహతా సినిమా ‘ఫరాజ్‘తో బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నాడు.ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే జహాన్ కపూర్ నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఇన్స్టాగ్రామ్లో ట్రైలర్ను షేర్ చేసిన జెహాన్ కపూర్.“ఫరాజ్ పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉంది.మానవత్వం, స్నేహం, ద్వేషం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడిన యవకుని కథ ఇది.” అని అన్నాడు.

ప్రముఖ నటుడు పరేష్ రావల్ కుమారుడు ఆదిత్య రావల్ కూడా ఫరాజ్ సినిమాలో కనిపించనున్నాడు.ఫరాజ్ చిత్రానికి సంబంధించిన పవర్ ఫుల్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ఇది 2016లో ఢాకా కేఫ్లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా రూపొందుతున్న సినిమా.ఇది 3 ఫిబ్రవరి 2023న థియేటర్లలో విడుదల కానుంది.జహాన్ కపూర్ ఎవరు?జహాన్.శశి కపూర్ కొడుకు కునాల్ కపూర్, షీనా కపూర్ల కుమారుడు.
ఢాకాలో జరిగిన టెర్రరిస్టుల దాడి కథాంశంతో రూపొందిన ఈ జహాన్ సినిమా ట్రైలర్ని ప్రేక్షకులు మెచ్చుకున్నారు.

శశికపూర్ విదేశీ నటి జెన్నిఫర్ని 1958లో పెళ్లి చేసుకున్నారు.వీరికి కెండాల్లో వివాహమైంది.వీరికి కునాల్, కరణ్ మరియు సంజన అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
దీని ప్రకారం చూస్తే జహాన్ రణబీర్ కపూర్, కరిష్మా, కరీనా, అదార్ జైన్, అర్మాన్ జైన్ల కజిన్ అని తెలుస్తోంది.జహాన్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలో విడుదలవుతోంది.
పరేష్ రావల్ తనయుడు ఆదిత్య రావల్ కూడా ఈ సినిమాతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.జహాన్ నటించిన ఈ సినిమా ట్రైలర్ను సినీ జనాలు ఎంతగానో ఆదరించారు.
ఢాకాలో జరిగిన టెర్రరిస్టుల దాడికి సంబంధించిన కథను ఈ చిత్రంలో చూపించనున్నారు.జహాన్ కపూర్ చాలా కాలంగా థియేటర్లో కొనసాగారు.
మకరంద్ దేశ్పాండే రూపొందించిన డాడ్ ప్లీజ్ నాటకంతో పృథ్వీ థియేటర్లో అడుగుపెట్టాడు.జహాన్ తన కుటుంబానికి చెందిన పృథ్వీ థియేటర్లో పలు ప్రదర్శనలు ఇచ్చాడు.







