తార్నాకలో ఫ్యామిలీ మృతి కేసులో కీలక మలుపు

హైదరాబాద్ లోని తార్నాకలో కుటుంబం అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.రామకృష్ణా కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో నలుగురు విగతజీవులుగా కనిపించిన విషయం తెలిసిందే.

 A Turning Point In The Case Of The Death Of A Family In Tarnaka-TeluguStop.com

ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.మృతుడు ప్రతాప్ కుటుంబ సభ్యులను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

కరెంటు వైరుతో గొంతు నులిమి భార్య సింధూర, కుమార్తె ఆధ్య, తల్లిని ప్రతాప్ హత్య చేసాడు.అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తించారు.

కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు.హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్యామిలీ మార్చాలన్న విషయంలో ప్రతాప్ కు, ఆయన భార్య సింధూరకు గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ కారణంగానే హత్యలు జరిగాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube