టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రంలో సమంత శకుంతల పాత్రలోఎంతో ఒదిగిపోయిన నటించారని చెప్పాలి.
ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది అయితే ఫిబ్రవరి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈ ట్రైలర్ పై స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ పై కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలో కూడా స్పందిస్తున్నారు.ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఈ సినిమా ట్రైలర్ పై స్పందించారు.ఈ సందర్భంగా రష్మిక ఈ ట్రైలర్ పై స్పందిస్తూ ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పడమే కాకుండా ఆల్ ద బెస్ట్ సామీ అంటూ ముద్దుగా సమంతను పిలిచారు.ఇలా ఈ సినిమా ట్రైలర్ పై రష్మిక స్పందించడంతో అభిమానులు రష్మిక సమంతను ముద్దుగా సామి అని పిలుస్తారా అని ఆశ్చర్యపోతున్నారు.

రష్మిక శాకుంతలం ట్రైలర్ పై స్పందించడంతో సమంత సైతం మిషన్ మజ్ను సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ ఈ సినిమా ట్రైలర్ చూశాను చాలా అద్భుతంగా ఉంది కంగ్రాట్స్ అంటూ రిప్లై ఇచ్చారు.ఇలా ఇద్దరు హీరోయిన్స్ తమ సినిమాల గురించి ముచ్చట్లు పెట్టుకోవడంతో వీరిద్దరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







