ఏపీ హైకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ మేరకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎఫ్ఐఆర్, ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలన్న ధర్మాసనం.తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
ఎంపీ రఘురామ తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.చట్టపరంగా ఉన్న హక్కులను వినియోగించుకునేందుకు రఘురామకు అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
రఘురామ తరపు న్యాయవాది వాదనలలో ఏకీభవించిన కోర్టు ఎఫ్ఐఆర్ లు, రిజిస్టర్ కాకుండా ఉన్న వివరాలు కూడా వెంటనే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.







