కొత్త ప్రయాణం అంటూ చిరంజీవి కూతురి షాకింగ్ పోస్ట్.. అలా చేయబోతున్నారా?

చిరంజీవి కూతురు శ్రీజ సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతుందనే సంగతి తెలిసిందే.న్యూ ఇయర్ సందర్భంగా కొత్త ప్రయాణం అంటూ సోషల్ మీడియాలో శ్రీజ ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.శ్రీజ తన పోస్ట్ లో 2022 సంవత్సరం నా జీవితంలో ముఖ్యమైనదని పేర్కొన్నారు.2022లో నేను ఏంటో నాకు అర్థమైందని ఆమె కామెంట్లు చేశారు.

 Chiranjeevi Daughter Sreeja Shocking Post Goes Viral In Social Media Details, Sr-TeluguStop.com

ఒక వ్యక్తిగా నన్ను నేను ఎంతగానో అర్థం చేసుకున్నానని ఆమె వెల్లడించారు.నా గురించి నాకు శ్రద్ధ మరింత ఎక్కువగా పెరిగిందని శ్రీజ చెప్పుకొచ్చారు.నా తప్పొప్పులను నేను గ్రహించానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త మార్పుకు నేను నాంది పలికానని శ్రీజ వెల్లడించారు.

నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్లందరినీ కలవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని శ్రీజ కామెంట్లు చేశారు.

నా ఎదుగుదలలో మరియు పతనాల్లో తోడుగా ఉన్నవాళ్లకు కృతజ్ఞతలు అని ఆమె చెప్పుకొచ్చారు.నన్ను ఈ విధంగా అనుమతించిన అందరినీ ధన్యవాదాలని శ్రీజ పేర్కొన్నారు.మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని ఇక నా ప్రయాణం స్టార్ట్ అవుతుందని ఆమె అన్నారు.

ప్రేమ, జ్ఞానం, కరుణ, ఆనందంతో 2023లో అడుగుపెడుతున్నానని శ్రీజ వెల్లడించారు.కొత్త ప్రయాణం అంటూ శ్రీజ కామెంట్ చేయడంతో త్వరలో శ్రీజ శుభవార్త చెప్పనున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఆ శుభవార్తకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే.మరి శ్రీజ నిజంగానే ప్రేక్షకులకు శుభవార్త చెప్పబోతున్నారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.శ్రీజ గురించి సోషల్ మీడియాలో వేర్వేరు గాసిప్స్ తరచూ ప్రచారంలోకి వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube