ప్రముఖ నటి రంభ ఒకప్పుడు వరుస సినిమాలలో నటించగా ప్రస్తుతం ఈ నటి సినిమాలకు దూరంగా ఉన్నారు.తాజాగా రంభ ఒక సందర్భంలో మాట్లాడుతూ నటుడు జేడీ చక్రవర్తిపై షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ హీరో చేసిన పని వల్ల బాధ పడ్డానని రంభ పేర్కొన్నారు.రంభ, చక్రవర్తి నటించిన బొంబాయి ప్రియుడు సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించింది.
నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువమంది స్నేహితులలో జేడీ చక్రవర్తి ఒకరని నేను పెళ్లికి పిలిచి కచ్చితంగా రావాలని కోరినా అతను మాత్రం నా పెళ్లికి రావడానికి ఆసక్తి చూపలేదని రంభ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డానని రంభ అన్నారు.
జేడీ చక్రవర్తికి ఫ్రెండ్ షిప్ చేయడం కూడా రాదని ఆమె కామెంట్లు చేశారు.ఫ్రెండ్ షిప్ విషయంలో జేడీ చక్రవర్తి అబద్ధాల కోరు అని ఆమె పేర్కొన్నారు.
రంభ చేసిన కామెంట్ల గురించి జేడీ చక్రవర్తి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.రంభ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఆమె రీఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.వయస్సు పెరుగుతున్నా రంభ మాత్రం యంగ్ లుక్ లోనే కనిపిస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.రంభ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు.
రంభ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమె కెరీర్ మరింత పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.రంభ రీఎంట్రీ ఇస్తామంటే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.నటి రంభకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే.