టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో జనవరి 27 నుండి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ పాదయాత్రకు సంబంధించి లోగోను పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేసినప్పుడు తాము అప్పట్లో అడ్డుకోలేదని లోకేష్ పాదయాత్రను జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది ఆయన కర్మ అని అన్నారు.పాదయాత్రకు సంబంధించి పోలీసులను అనుమతి కోరుతామని.
పేర్కొన్నారు.లోకేష్ పాదయాత్రలో రాష్ట్ర యువత అడుగులు అడుగు వేయాలని సూచించారు.
అప్పట్లో కరోనా సమయంలో పరీక్షలు పెట్టి విద్యార్థుల ప్రాణాలు తీయటానికి ప్రభుత్వం వెనుకాడ లేదని అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు.ఆ సమయంలో విద్యార్థుల తరఫున పోరాడి పిల్లల ప్రాణాలను లోకేష్ కాపాడారని చెప్పుకొచ్చారు.
ఇక పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విషయంలో కూడా.లోకేష్ పోరాటం వల్లే ఏజ్ బార్ అయిన వారికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు.
ఇంకా పెన్షన్ ల విషయంలో జిల్లా కలెక్టర్ లు మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి జగన్ చెప్పే అబద్దాలను ఖండించాలని.బుద్ధి చెప్పాలని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.