వైసీపీ పాలనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసేందేమీ లేదన్నారు.
ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.కేంద్రం ఎంతో చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
వైసీపీ ఎంపీలు రాజకీయాలకే పరిమితం అయ్యారని విమర్శించారు.ఏపీలో ఐటీ రంగం అత్యంత దారుణంగా ఉందని జీవీఎల్ పేర్కొన్నారు.
రాష్ట్ర ఐటీ రంగ ఉత్పత్తులు, ఎగుమతుల వాటా జీరో అని తెలిపారు.







