బీఆర్ఎస్ పార్టీ నేతల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.అవినీతి ఆరోపణలు పక్కదోవ పట్టించేందుకే ధర్నాలకు పిలుపునిస్తున్నారని విమర్శించారు.
రామగుండం ప్రాజెక్టును తిరిగి తెరిచినందుకు నిరసన చేస్తున్నారా అని ప్రశ్నించారు.కిసాన్ సమ్మాన్ పేరుతో రైతులకు సాయం చేస్తున్నందుకా అని నిలదీశారు.
అవినీతి ఆరోపణలపై దృష్టి మళ్లించేందుకే ఈ నిరసనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.







