చాల మంది ఒక్కసారి కెమెరా, లైట్స్, గ్లామర్ చూసాక సినిమాల్లోనే ఉండాలని అనుకుంటారు.కానీ సినిమా ఇంట్రెస్ట్ లేకనో, ఆ ఫీల్డ్ నచ్చకనో కొంత మంది ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ నుంచి మాయం అయిపోతూ ఉంటారు.
అలంటి వారిలో గీతాంజలి గిరిజ ఉంటుంది.ఏ కారణాల చేతనో తెలియదు కానీ అమీర్ ఖాన్ మూవీ అని చెప్పిన కూడా ఆమె ఒప్పుకోకుండా సినిమా ఇండస్ట్రీ ని వదిలేసి వెళ్ళిపోయింది.ఇక సప్తపది చిత్రం హీరోయిన్ సబితా కూడా అంతే.ఆ తర్వాత మరెక్కడా ఆమె నటించలేదు.
ఇక షారుక్ ఖాన్ సరసన స్వదేశ్ సినిమాలో నటించిన హీరోనే గాయత్రి జోషి కూడా అంతే.అస్సలు ఇండస్ట్రీ వద్దు అనుకోని వెళ్ళిపోయింది.
ఇక బాలు చెల్లెలు ఎస్పీ శైలజ సైతం ఒకే ఒక్క సినిమాతో ఈ నటన నాకు వద్దు బాబోయి పాటలు చాలు అనుకోని కేవలం సంగీతం పైన ఫోకస్ చేసింది.అప్పటికే ఆమె క్లాసికల్ డ్యాన్సర్ కాబట్టి విశ్వనాధ్ పట్టుబట్టడం తో సాగర సంగమం సినిమాలో నటించింది.
ఆ లిస్ట్ లో మహానది శోభన కూడా వచ్చి చేరుతుంది.

శోభన .ఈ పేరు చెప్తే హీరోయిన్ శోభన అని అంత అనుకుంటారు కానీ.తమిళనాడు లో మరొక శోభన ఉంది.
ఆమెనే మహానది శోభన.చేసింది ఒకే ఒక సినిమా.
కమల్ హాసన్ కూతురిగా మహానది చిత్రంలో నటించిన శోభన ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ కి గుడ్ బాయ్ చెప్పేసింది.అస్సలు శోభన ఎవరు ? ఏం చేస్తుది అనే విషయం ఒకసారి తెలుసుకుందాం.ఈమె స్వతహాగా బాగా సంగీతం నేర్చుకున్న సింగర్.అందుకే మహానది సినిమాలో శ్రీరంగ రంగ నాధుడి దివ్య రూపమే చూడరే అంటూ సాగే ఈ పాటను సింగర్ ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం తో కలిసి శోభనే పాడింది.
ఈ సినిమానే ఆమెకు మొదటి మరియు ఆఖరి చిత్రం.ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించకపోవడానికి కారణాలు అయితే తెలియదు కానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది మాత్రం నటుడు మరియు దర్శకుడు అయినా సంతాన భారతి.
ఈ సినిమా తమిళ్ లో పుష్పాంగళ్ అనే పేరుతో విడుదల అయ్యి ఘనవిజయం సాధించింది.







