కడప జిల్లాలో పెన్నానదికి వరద ఉధృతి కొనసాగుతోంది.గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
రహదారులన్నీ నీట మునిగాయి.దీంతో జమ్మలమడుగు, ముద్దనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో సుమారు 16 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.మరోవైపు మైలవరం నుంచి పెన్నానదికి ఏడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు అధికారులు.
నీటి ప్రవాహం పెరగడంతో అప్రోచ్ రోడ్డుకు అధికారులు గండి కొట్టారు.కాగా ఇప్పటికే అప్రోచ్ రోడ్డు మూడు సార్లు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
అటు ఎగువున కురుస్తున్న వర్షాలతో గండికోటకు వరద నీరు భారీగా చేరుతుంది.