హైదరాబాద్ రాజ్భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.తెలంగాణ గవర్నర్ తమిళిసై తీరును నిరసిస్తూ ఛలో రాజ్భవన్ కు సీపీఐ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ తో పాటు రాజ్భవన్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.ఛలో రాజ్భవన్ లో పాల్గొనేందుకు సీపీఐ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.
రాజ్భవన్ వద్ద నిరసనకు దిగిన నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలిస్తున్నారు.