గుజరాత్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.బరిలో 833 మంది అభ్యర్థులుండగా 2.54 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.మరోవైపు అహ్నదాబాద్ లో ప్రధాని మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.89 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 1న పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.