కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార.ఈ సినిమా కన్నడ భాషలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో తిరిగి ఇతర భాషలలో కూడా ఈ చిత్రాన్ని డబ్ చేశారు.
కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో సుమారు 400 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఈ సినిమాతో రిషబ్ శెట్టి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.
ఇక ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంశల వర్షం కురిపించారు.ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నప్పటికీ ఈ సినిమాలో వరాహ రూపం పాట విషయంలో మాత్రం పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే.
వరాహ రూపం ట్యూన్ తైక్కుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ సంస్థ నవరసం పాట ట్యూన్ కాపీ కొట్టారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన కేరళ హైకోర్టు కాంతార సినిమాలో ఈ పాటను తొలగించాలని తీర్పు చెప్పారు.అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కాంతార చిత్ర బృందం ఎక్కడ స్పందించలేదు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రిషబ్ శెట్టి ఈ విషయం గురించి స్పందించారు.
ముందుగా కాంతర సినిమాకి ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ఈయన ధన్యవాదాలు తెలియజేశారు.అదేవిధంగా వరాహ రూపం పాట గురించి మాట్లాడుతూ ప్రస్తుతం కేరళ హైకోర్టులో ఈ పాట గురించి విచారణ జరుగుతుంది.
అయితే అక్కడ ఈ పాట విషయంలో ఏదో ఒక తీర్పు వచ్చిన తర్వాతే ఈ విషయంపై మనం మాట్లాడాల్సి ఉంటుంది అంటూ స్పందించారు.







