విజయవాడ ధర్నా చౌక్ పోలీసుల వలయంలో ఉంది.ఉపాధ్యాయులు ఆందోళనలు చేయడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా ధర్నా చౌక్ వైపు వచ్చిన టీచర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.ఆందోళనలకు పోలీసులు ముందు అనుమతి ఇచ్చి రద్దు చేయడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని టీచర్స్ కోరుతున్నారు.ప్రభుత్వం తమ అకౌంట్లలో నగదును తీసుకుందని ఆరోపిస్తున్నారు.
టీచర్ల నిరసన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.