వైసిపి మంత్రి రోజా చంద్రబాబుపై సీరియస్ కామెంట్ చేయడం జరిగింది చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని రోజా మండిపడ్డారు.కర్నూలులో ఆయన ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనం అని స్పష్టం చేశారు.
వైజాగ్ ఇంకా ఇప్పటంలో… పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు ఒక పావు లాగా వాడుకున్నారని అన్నారు.ఇల్లు కూల్చారని కోర్టుకు వెళ్తే న్యాయస్థానం… పిటిషనర్లకే.
జరిమానా విధించడం జరిగిందని పేర్కొన్నారు.ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కూడా కూరలో కరివేపాకు లాగా వాడుకుని వదిలేస్తారని ఈ విషయాన్ని ముందే గ్రహిస్తే.
మంచిదని రోజా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
కొద్దిరోజుల క్రితం ఇప్పటంలో.
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం జరిగింది.జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఆ ఇప్పటం గ్రామస్తులు స్థలం ఇవ్వటంతో .వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్కడ కొన్ని ఇళ్లను నోటీసులవ్వకుండానే కూల్చేయటానికి పాల్పడిందని.ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
ఇక ఇదే సమయంలో.బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో అధికారులు ముందు నోటీసులు ఇచ్చినా గాని ఇవ్వనట్టు పిటిషనర్లు న్యాయస్థానాన్ని తప్పు పట్టించడంతో… ఒక్కొక్క పిటిషనర్ కి లక్ష రూపాయలు చొప్పున కోర్ట్ జరిమానా విధించడం జరిగింది.మొత్తం 14 మంది పిటిషనర్ లకు న్యాయస్థానం జరిమానా విధించింది.







