రష్మిక మందన… కన్నడ ఇండస్ట్రీ లో అడుగు పెట్టు తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతుంది.ఇలా అన్ని భాషల్లో మంచి హీరోయిన్ గా ఎదగడం లో తప్పు లేదు కానీ అప్పుడెప్పుడో జరిగిన ఒక విషయాన్నీ మనసులో పెట్టేసుకొని లాగి లాగి అందరిని ఇబ్బంది పెట్టడమే ప్రస్తుతం అటు కన్నడ ఇండస్ట్రీ తో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీ ని షేక్ చేస్తుంది.
రష్మిక మందన్న కి మొదటగా సినిమా అవకాశం ఇచ్చింది రిషబ్ శెట్టి.కిరాక్ పార్టీ అనే సినిమాతో రక్షిత్ మరియు రష్మిక కు లైఫ్ ఇచ్చాడు.
ఆ సినిమా విజయ వంతం కావడం తో అందరికి లైఫ్ వచ్చింది.రష్మిక సైతం స్టార్ హీరోయిన్ అవ్వడానికి ఆ చిత్రం దోహదపడింది.
ఇక రష్మిక మరియు రక్షిత్ లవ్ లో పడి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.కారణాలు ఏంటో తెలియదు కానీ బ్రేకప్ అయితే అయ్యింది.
అప్పటి నుంచి రష్మిక రక్షిత్ శెట్టి పై తెగ కోపం పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది.ఇప్పటి వరకు అవకాశం రాలేదు కానీ వస్తే అతడిపై తన ప్రతాపం చూపించేలా ఉంది.
ఇక ఆ కోపం అక్కడైతే ఆగిపోతే ఒకే కానీ అతడి స్నేహితులపై కూడా ఆ ప్రభావం పడుతుంది.ఇక రష్మిక ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు మొదట సినిమా అవకాశం ఎలా వచ్చిందో చెప్పింది.
తాను ఒక అందాల పోటీల్లో పాల్గొంటే మొదటి బహుమతి వచ్చిందని, ఆ తర్వాత ఒక ప్రొడక్షన్ కంపెనీ నుంచి తనకు కాల్ వచ్చి సినిమా అవకాశం వచ్చిందని చెప్పింది.
ఈ చెప్పడం మాములుగా చెప్తే ఒకే కానీ వెటకారం తో కూడిన ఒక సిగ్నల్ ఇచ్చింది.ఆమె చెప్పిన విధానం లో ఒక సోకాల్డ్ కంపెనీ ఇచ్చిందిలే అన్నట్టు గా ఉంది.దీనికి బదులుగా రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూ లో ఆమెకు కౌంటర్ ఇచ్చాడు.
అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో సమంత, రష్మిక, సాయి పల్లవి ల్లో ఎవరిని తీసుకుంటారు అని అడిగితే సాయి పల్లవి నాకు ఇష్టం అని, సమంత అంటే నచ్చుతుందని తెలిపాడు.అలాగే తనకు కొంత మంది నచ్చారని రష్మిక చేసిన సైగలతో చెప్పాడు.
దాంతో రష్మిక వర్సెస్ రిషబ్ వివాదం బాగా ముదిరి పాకాన పడింది.ఇవి ఇప్పటి వరకు ఒకే కానీ ముందు ముందు ఇవి మరి ఎక్కువైతే కష్టాలు తప్పవేమో.